
📌 Key Points
- ఏఐ సాయంతో టాలీవుడ్ హీరోల బికినీ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
- ఈ మార్ఫింగ్ ఫోటోలు సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన, కలకలం రేపుతున్నాయి.
- మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖ హీరోల ఫోటోలు కూడా మార్ఫింగ్కు గురయ్యాయి, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఏఐ దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం అప్రమత్తమయ్యారు.
టాలీవుడ్ హీరోల బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫింగ్ చేయబడిన ఈ చిత్రాలు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
బికినీ ట్రెండ్: హీరోల మార్ఫింగ్ ఫోటోల కలకలం
Tollywood Heros : హీరోయిన్లు అందాలను ఆరబోసేందుకు బికినీలు వేసుకుంటారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ బికినీలు ఇప్పుడు బయట కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.. హీరోయిన్లు మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాల్దీవులకు వెళ్తూ బికినీలను వేస్తున్నారు. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈమధ్య ఎక్కువగా బికినీ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బికినీ వేసుకొని అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారు.. అయితే ఇది కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉండేది.. అని ఇప్పుడు ట్రెండ్ మారింది.. హీరోలు కూడా బికినీలు వేసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అవి నిజమే అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.. ఈ మధ్య ఏఐ ద్వారా మార్ఫింగ్ ఫోటోలు చాలానే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు హీరోల బికినీల ఫోటోలు కూడా ఇలా క్రియేట్ చేసినవే. ఏ హీరోల ఫోటోలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..
టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలో ఇలాంటివి బయటకు వస్తున్నాయని బాధపడాలో తెలియడం లేదు. ఈ మధ్య ఏఐ సాయంతో కొందరు కొన్ని దారుణమైన పనులు చేస్తున్నాయి.. వీటివల్ల చేసే మంచి ఏమో గానీ చెడు బాగా ఎక్కువైంది.. హీరోయిన్ల బోల్డ్ ఫోటోలు ఎక్కువ అయ్యాయి.. వాటిపై సైబర్ క్రైమ్ లో కేసులు నమోదు అవ్వడంతో యాక్టివ్ అయిన పోలీసులు అలాంటి వాటిని చేస్తున్న వాటి పై కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.. తాజాగా హీరోల బికినీ ట్రెండ్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఏఐ దుర్వినియోగం: సైబర్ క్రైమ్ హెచ్చరికలు
మెగాస్టార్ చిరంజీవి ఫోటోపై అభిమానుల ఆగ్రహం
‘గ్రోక్ ఏఐ’ సృష్టించిన బికినీ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలలోని హీరోలను కలవరపెడుతుంది. నిండుగా ఉన్న ఫోటోలను కాస్త బికినీలోకి మార్చేశారు. హీరోలు చాలా మంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోల బికినీ ఫోటోలు జనాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బికినీ పిక్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బికినీ వేసుకున్నట్లు కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి.. ట్రోలింగ్ చేస్తున్నారు.. మన శంకర వరప్రసాద్ పోస్టర్ని ఇలా చేయడంపై మెగాస్టార్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.. అయితే దీనిపై మెగాస్టార్ అభిమాన సంఘం సీరియస్ అవుతోంది. రేపు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. మరి దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో చూడాలి… ఇప్పటివరకు ఈయన ఫోటో బయటకొచ్చింది.. ఇకముందు ఏ హీరో ఫోటో బయటకు వస్తుందో చూడాలి.. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ జనవరి 12 న థియేటర్లలోకి రాబోతుంది.
ఏఐ దుర్వినియోగం పెరిగిపోతున్న ఈ సమయంలో, ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలపై అప్రమత్తంగా ఉండాలి. టాలీవుడ్ హీరోల ఫోటోలతో పాటు, ఇతరుల చిత్రాల పట్ల కూడా జాగ్రత్త వహించడం అవసరం. సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలి.


