
దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జయశంకర్ ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి, బావగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Key Points
'అరి' చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది, దర్శకుడు జయశంకర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
జయశంకర్ తన తండ్రి, బావగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు ఇన్స్టాలో తెలిపారు.
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
'అరి' కథ కోసం జయశంకర్ ఏడేళ్ల పాటు కృషి చేసి, హిమాలయాలకు కూడా వెళ్లారు.
‘అరి’ మూవీ: విడుదల, నటీనటులు
పేపర్ బాయ్ తర్వాత దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ అరి ’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు ( అక్టోబర్ 10) న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు .
దర్శకుడు జయశంకర్ భావోద్వేగ లేఖ
‘ అరి ’ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది . ఈ మూవీ తెరకెక్కించే సమయంలోనే నా జీవితానికి మూల స్థంబాలుగా ఉన్న మా నాన్న , బావగారిని కోల్పోయాను . అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను . ఇక రేపటి నుంచి ఈ చిత్రం మీ ( ఆడియన్స్ ) సొంతం ’ అని ఇన్స్టాలో రాసుకొచ్చాడు .
‘అరి’ కథ కోసం ఏడేళ్ల ప్రయాణం
‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాలకు కూడా వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిసి అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు .
ఏడేళ్ల పాటు అరి సినిమా కథ కోసం జయశంకర్ చేసిన కృషి, ఆధ్యాత్మిక నేపథ్యం, ఆయన భావోద్వేగ ప్రకటన సినిమాపై అంచనాలను పెంచుతోంది. రేపు విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిద్దాం.


