
📌 Key Points
- గుజరాత్లోని వడోదరలో బస్టాండ్ స్లాబ్ కూలి ఒక వ్యక్తి మృతి
- దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఐరన్ స్ట్రక్చర్ కూలింది
- 2014లో నిర్మించిన బస్టాండ్ 10 ఏళ్లలోనే కుప్పకూలడంపై విమర్శలు
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ బస్సు టర్మినల్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వడోదరలో కుప్పకూలిన బస్టాండ్ స్లాబ్
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్టాండ్ స్లాబ్ కూలిన సంఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ వడోదరలోని సెంట్రల్ బస్సు టర్మినల్ స్లాబ్ కుప్పకూలింది. ఈ సంఘటనలో దారిన వెళ్లే ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏప్రిల్ 10వ తేదీన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఐరన్ స్ట్రక్చర్ దాదాపు 40 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అటు వైపుగా వెళ్తున్న 60 సంవత్సరాల వృద్ధుడు మరణించాడు. అయితే, 2014లోనే ఈ నిర్మాణం చేపట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ, నిర్మించిన 10 ఏళ్లలోనే కుప్పకూలడం వివాదంగా మారింది. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. క్లిక్
10 ఏళ్లలోనే కూలిన నిర్మాణం
వైరల్ అవుతున్న వీడియో
గుజరాత్లో బస్టాండ్ కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నాణ్యత లేని నిర్మాణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


