|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమరావతికి జాతీయ న్యాయ అకాడమీ: సీజేఐకి చంద్రబాబు విజ్ఞప్తి! సఫలమవుతుందా?

Published: 01-03-2026, 9:35 PM
అమరావతికి జాతీయ న్యాయ అకాడమీ: సీజేఐకి చంద్రబాబు విజ్ఞప్తి! సఫలమవుతుందా?
  • అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీజేఐని కోరిన సీఎం చంద్రబాబు.
  • జస్టిస్ సిటీలో న్యాయవ్యవస్థకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.
  • మధ్యవర్తిత్వంతో కేసు పరిష్కరిస్తే రూ.10 వేలు ప్రోత్సాహకం ఇస్తామని సీఎం ప్రకటన.
  • దేశంలోనే బెస్ట్ జ్యుడిషియల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. అమరావతిలోని జస్టిస్ సిటీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సీజేఐకి చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు… భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.

ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘ రాజధాని నిర్మాణంలో జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తాం. వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని తెలిపారు.

అమరావతి జస్టిస్ సిటీ ప్రణాళిక

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ అకాడమీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

“అమరావతిలోని జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. దీనికి సీజేఐ సహకారం కావాలి. గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారు. మా తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలో సమస్యలను పరిష్కరించారు. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తాం… కేసులు పరిష్కారం కాకున్నా రూ. 3 వేలు ఇస్తాం. కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందితే… త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని సీఎం అభిప్రాయపడ్డారు.

మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహకాలు

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు. బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

“ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. వికసిత్ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

అమరావతిని దేశంలోనే అత్యుత్తమ జ్యుడిషియల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి. సీజేఐ సహకారం ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.