
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పూజలు ముగించిన తర్వాత, ఆయన తన భార్య తేజస్వినితో కలిసి సాంప్రదాయక నృత్యాన్ని చేశారు. ఈ క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Key Points
దిల్ రాజు శ్రీవారి కళ్యాణోత్సవం తన కొత్త ఇంట్లో నిర్వహించారు.
పూజ అనంతరం భార్య తేజస్వినితో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దిల్ రాజు తన భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం అలవాటు.
దిల్ రాజు కుటుంబంతో శ్రీవారి దర్శనం
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు . ఒకవైపు తన బ్యానర్ లో రాబోతున్న సినిమా పనులు , మరోవైపు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలతో నిత్యం బిబీ బిబీగా ఉండే దిల్ రాజు .. ఖాలీ సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటాడు . ఆయనకు దైవభక్తి కాస్త ఎక్కువే . ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి అంటే ఆయనను చాలా ఇష్టం . అందుకే సొంతూరిలో గుడిని సైతం నిర్మించాడు . వీలు ఉన్నప్పుడల్లా భార్య , కొడుకుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాడు .
కళ్యాణోత్సవంలో ప్రత్యేక నృత్యం
తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాడు దిల్ రాజు. పూజ అనంతరం సతీమణి తేజస్వినితో కలిసి సంప్రదాయం ప్రకారం నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది .
వైరల్ అవుతున్న వీడియో
దిల్ రాజు , తేజస్వినిల వివాహం 2020 లో జరిగింది . దిల్ రాజుకు ఇది రెండో వివాహం . మొదటి భార్య అనిత 2017 లో గుండెపోటుతో మరణించింది . కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు .. 2020 లో తేజస్వీని వివాహం చేసుకున్నారు . ఈ జంటకు 2022 బాబు పుట్టాడు . పేరు అన్వీరెడ్డి .
దిల్ రాజు కుటుంబంతో కలిసి శ్రీవారి కళ్యాణోత్సవాన్ని జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ద్వారా, ఆయన భక్తిని ప్రజలు మెచ్చుకుంటున్నారు.


