|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ektaa R Kapoor: ఒక్క తండ్రి ఆలోచనను మార్చగలిగినా అదే నాకు గర్వం

Published: 18-07-2025, 2:49 AM
Ektaa R Kapoor: ఒక్క తండ్రి ఆలోచనను మార్చగలిగినా అదే నాకు గర్వం

ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తన ప్రజాదరణ పొందిన ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. స్మృతి ఇరానీ, అమర్ ఉపాధ్యాయ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా, ఏక్తా తన అనుభవాలను పంచుకున్నారు.

Key Points

1

క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తిరిగి వస్తోంది!

2

స్మృతి ఇరానీ, అమర్ ఉపాధ్యాయ్ తిరిగి తులసి, మిహిర్ గా!

4

ఒక తండ్రి ఆలోచనను మార్చిన ధారావాహిక ప్రభావం!

KSBKBT తిరిగి వస్తోంది!

ప్రముఖ నిర్మాత ఏక్తా ఆర్ కపూర్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ధారావాహిక ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’ (KSBKBT)ని తిరిగి ప్రారంభించబోతున్నారు. ఇందులో నాటి సీరియల్ నటులు స్మృతి ఇరానీ , అమర్ ఉపాధ్యాయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ ఏడాది ఈ ధారావాహిక 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, దీన్ని తిరిగి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని ఏక్తా భావిస్తున్నారు. “మేం కొన్ని ఎపిసోడ్‌లను మాత్రమే చేయాలనుకుంటున్నాం. తద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకురావచ్చు. ముఖ్యంగా, మాకు ఇంతగా ఇచ్చిన టెలివిజన్ మాధ్యమానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం” అని ఆమె అంటున్నారు.

స్మృతి ఇరానీ పోషించిన తులసి పాత్ర భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ఐకానిక్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. KSBKBT కొత్త వెర్షన్‌తో తులసి పాత్ర నేటి సమాజంలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలపై దృష్టి సారిస్తుందని ఏక్తా ఆర్ కపూర్ నమ్ముతున్నారు. “భారతదేశంలోని చాలా మంది ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయిన ఈ శక్తిమంతమైన పాత్రను ఉపయోగించుకుని, ఆమెను అధునాతన వెర్షన్‌లో చూపించి, ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడించాలనుకుంటున్నాం. ప్రభావం, అవగాహన కల్పించడం, ఆలోచనలను మార్చడం వంటివి సాధించడానికి ఈ కథలను ఉపయోగిస్తున్నాం” అని ఆమె చెప్పారు.

ఇందుకు ఉదాహరణగా ఏక్తా ఒక సంఘటనను పంచుకున్నారు. “కొంతకాలం క్రితం ఒక యువకుడు నాతో మాట్లాడుతూ, ‘మా నాన్న మిమ్మల్ని ద్వేషించేవారు’ అని చెప్పాడు. నేను కారణం అడిగితే, ‘మీ వల్ల మా అమ్మ మొదటిసారి మా నాన్నకు జవాబు చెప్పింది. అది వారికి జవాబులా అనిపించి ఉండవచ్చు, కానీ నాకు తెలిసి ఆమె తన అభిప్రాయాన్ని మొదటిసారి స్పష్టంగా చెప్పింది. తులసి తన ఇంట్లో అలా చేయగలిగినప్పుడు, నేను ఎందుకు చేయలేను అని ఆమె భావించింది’ అని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు ఏక్తా కృషికి నిదర్శనం.

తులసి పాత్ర ప్రాముఖ్యత

ఈ టీవీ సీరియల్ గతంలో అద్భుతమైన విజయాన్ని సాధించినప్పటికీ, దానితో వచ్చే ఒత్తిడిని ఏక్తా అర్థం చేసుకున్నారు. కానీ ఆమె ఏమాత్రం కలవరపడటం లేదు. “మేం సృష్టించిన నాస్టాల్జియా నుండి ఎవరూ కిందకు దిగాలనుకోరు.. మళ్లీ పరీక్షకు గురవ్వాలనుకోరు. కానీ స్మృతి, ఛానల్ ప్రతినిధులూ ‘మనం ఒక ప్రభావితమైన ప్రాజెక్ట్‌ను సృష్టిద్దాం. కేవలం రేటింగ్‌ల వెంట పడకుండా, ఒక మంచి కథను రూపొందించడానికి కృషి చేద్దాం. వినోదాన్ని అందిద్దాం కానీ ప్రసంగాలు వద్దు’ అన్నారు. ఈ కథతో మేం ఉపయోగించుకోవాలనుకుంటున్న శక్తి ఇదే. మేం పోటీలో లేం, ఆటలో ఉన్నాం” అని అన్నారు.

నేటి రోజుల్లో టెలివిజన్ ప్రేక్షకులు చాలావరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లుతున్నప్పటికీ, ఏక్తా తిరిగి స్మాల్ స్క్రీన్‌పైకి రావాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం అడిగితే “ముఖ్యంగా, నా మొదటి ప్రేమ ఎల్లప్పుడూ టెలివిజనే. ఇంటర్నెట్ కంటే కూడా ఈ మాధ్యమానికి ఎక్కువ విస్తృతి ఉంది. ఇంటర్నెట్‌లో చాలా గందరగోళం ఉంది. అది చెల్లాచెదురుగా ఉంటుంది. ప్రజలను, కుటుంబాలను, ఆలోచనలను తిరిగి కలిపే సామర్థ్యం టెలివిజన్‌కు ఉంది” అని చెప్పారు.

సమాజంపై ప్రభావం

KSBKBT మొదటిసారి ప్రసారమైనప్పుడు భారతీయ టెలివిజన్ రూపురేఖలను మార్చివేసింది. ఈ రీబూట్ మళ్లీ మాధ్యమాన్ని పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నమా? అని అడిగితే “నాకు టీవీని పునరుద్ధరించడం, ఎక్కువ శబ్దం చేయడం, అధిక టీఆర్పీ రేటింగులు పొందడం రెండో అంశం. అయితే, ప్రజలు ఒక షోలో జరిగిన విషయాలను డైనింగ్ టేబుల్‌పై చర్చించుకునే విధంగా ఈ మాధ్యమాన్ని సముచితంగా మార్చడం ప్రాథమిక ప్రాధాన్యత. టీవీతో నేను అది చేయగలిగితే, ఒక్క ఆలోచనను మార్చగలిగితే, ఒక తండ్రి తన కూతురి విజయం పట్ల గర్వపడగలిగితే, దాని వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగకుండా చూడగలిగితే, నేను చాలా గర్వపడతాను” అని ఆమె స్పష్టం చేశారు.

చాలా మంది భారతీయ టెలివిజన్‌లో వచ్చే కంటెంట్‌ ను ప్రగతి నిరోధకంగా (regressive) చూస్తారు. KSBKBT వంటి డైలీ సోప్‌లను తరచుగా దానికి ఉదాహరణగా చూపిస్తారు. ఈ వ్యాఖ్యలకు ఏక్తా ఇలా సమాధానం ఇచ్చారు. “మీరు తెలిసిన ప్రపంచానికి తెలిసిన కథ చెబితే, అది పెద్ద విషయం కాదు. జ్ఞానం పొందినవారు మరింత జ్ఞానం పొందుతారు. మీరు ప్రజానీకాన్ని చేరుకోవాలి, వారికి సంబంధించినదై ఉండాలి. వారి సమస్యల గురించి మాట్లాడాలి. ఆపై సరిహద్దులను దాటాలి. మేం గృహ హింస, వైవాహిక అత్యాచారం, వయస్సు వివక్ష వంటి సమస్యలను చర్చించాం. దాని గురించి కుటుంబాలు చర్చించుకున్నాయి. మేం మళ్లీ అదే చేయాలని ఆశిస్తున్నాం. ప్రజానీకాన్ని చేరుకోవాలి. వినోదాన్ని అందించాలి. కుటుంబాలను ఏకం చేయాలి. వారిని ఆలోచింపజేసే ఏదో ఒకటి చెప్పాలి” అని వివరించారు.

ఈ ధారావాహిక తిరిగి రావడం వల్ల, సమాజంలోని ముఖ్యమైన సమస్యల గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది. పునరాగమనం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.