
📌 Key Points
- సుమంత్ ప్రభాస్ ‘మేం ఫేమస్’ తర్వాత నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టు పైన’.
- సుభాష్ చంద్ర దర్శకత్వంలో నిధి హీరోయిన్గా నటించింది. ఏసియన్ సినిమాస్ నిర్మిస్తోంది.
- టీజర్ గోదావరి నేపథ్యంలోని పల్లెటూరి ప్రేమకథ, స్నేహితుల అల్లర్లను ఆవిష్కరించింది.
- జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
‘మేం ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్ నటిస్తున్న ‘గోదారి గట్టు పైన’ మూవీ టీజర్ విడుదలైంది. గోదావరి అందాల నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఆకట్టుకుంది. స్టార్ కాస్టింగ్, అద్భుతమైన డైలాగ్లతో టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.
గోదారి గట్టు పైన: నటీనటులు, సాంకేతిక బృందం
‘మేం ఫేమస్’(Mem Famous) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్(Sumath Prabhas) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘గోదారి గట్టుపైన’(Godari Gattupaina). సుభాష్ చంద్ర(Subhash Chandra) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి(Nidhi) హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఏసియన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత అభినవ్ రావు(Abhinav Rao) ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు చిత్రబృదం.
ఇక టీజర్ను గమనించినట్లయితే.. టైటిల్కి తగ్గట్టుగానే గోదావరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీలా అనిపించింది. ముగ్గురు స్నేహితుల ఆట.. పాటలూ, అల్లర్లు అన్నీ పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేస్తాయి. సుమంత్ ప్రభాస్ అండ్ నిధిల కెమిస్ట్రీ ఈ కథకు ప్లస్ అనే చెప్పవచ్చు. జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల.. ఇలా స్టార్ కాస్టింగ్ బాగానే ఉంది. ఇక కమెడియన్ సుదర్శన్ చెప్పే ‘మణిరత్నం, గౌతమ్ మీనన్ టచ్ చేయలేని క్రేజీ కాంబినేషన్ రా ఇది’ అనే డైలాగ్ ఫన్నీగా కుదిరింది. ఫైనల్గా కామెడీ, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో టీజర్ ఆకట్టుకుంది.
ఆసక్తికరంగా ‘గోదారి గట్టు పైన’ టీజర్ విశేషాలు
మణిరత్నం, గౌతమ్ మీనన్ను టచ్ చేసిన డైలాగ్!
మొత్తంగా, ‘గోదారి గట్టు పైన’ టీజర్ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ప్రేమకథను సూచించింది. సుమంత్ ప్రభాస్ నటన, డైలాగ్లు సినిమాకు ప్లస్ అవుతాయని స్పష్టమవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో చూడాలి.


