|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Published: 12-12-2025, 5:08 AM
Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
  • తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
  • హీరోల భారీ రెమ్యునరేషన్లు పెంచడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • తక్కువ ధరల వద్దే కుటుంబాలు సినిమా చూస్తాయని, అది మంచి విధానమని సూచించారు.
  • ‘అఖండ 2’ టికెట్ల పెంపు వివాదం, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. హీరోల భారీ రెమ్యునరేషన్లు ప్రశ్నిస్తూ, ‘అఖండ 2’ వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్రలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. సినిమా నిర్మాతలు, దర్శకులు తమ వద్దకు టికెట్‌ ధరలు పెంచమని తమ వద్దకు రావొద్దని చెప్పారు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్‌ ఎవరు ఇవ్వమన్నారని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. తక్కువ ధరలు ఉన్నప్పుడే ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి సినిమా చూస్తారని, ఆ విధానమే మంచిదని సూచించారు. అందుకే, తెలంగాణలో ఇకనుంచి రేట్లను పెంచే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి.

టికెట్ల పెంపుపై గత వివాదాలు

Kaantha OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నిర్మాతలు, దర్శకులకు మంత్రి సూచన

తాజాగా, అఖండ 2 సినిమా రిలీజ్ సందర్బంగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముందు తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అవకాశాన్ని కలిపిస్తూ జీవో జారీ చేసింది. దానిని వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు సర్కార్ ఇచ్చిన జీవోను కొట్టివేసింది. తాజాగా మరోసారి ఈ విషయంపై వాదనలు జరుగంగా నిర్మాతలకు ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. అయితే, ప్రతీసారి ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మంత్రి కోమటిరెడ్డి ప్రకటన సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులపై భారం తగ్గించి, అందరికీ వినోదాన్ని చేరువ చేయడమే లక్ష్యమని ఆయన సూచించారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో టికెట్ ధరల విధానాన్ని ప్రభావితం చేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.