
నటి మంచు లక్ష్మి తన ‘టీచ్ ఫర్ చేంజ్’ ఎన్జీఓ ద్వారా నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగానికి తన సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యం.
Key Points
మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ చేంజ్' ఎన్జీఓ ద్వారా నెల్లూరులో 12 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలను అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల మధ్య ఉన్న తేడాను తగ్గించే ప్రయత్నంగా ఈ కార్యక్రమం.
నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవం జరిగింది.
మంచు లక్ష్మి ఎన్జీఓ కార్యక్రమం
Manchu Lakhsmi : మంచు లక్ష్మి గత కొన్నేళ్లుగా తన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్స్, అక్కడ స్కూల్ లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. తాజాగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని 12 పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మి.
ఈ క్రమంలో నెల్లూరు కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ లో ఈ కార్యక్రమం ప్రారంభానికి మంచు లక్ష్మి హాజరైంది. మంచు లక్ష్మి అక్కడి లోకల్ నాయకులతో కలిసి ఆ స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించింది.
నెల్లూరులో డిజిటల్ క్లాస్ రూమ్లు
ప్రభుత్వ పాఠశాలలకు మద్దతు
అనంతరం మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల విద్యకు ప్రభుత్వ పాఠశాలల విద్యకు వ్యత్యాసం కనిపిస్తుండడంతో ఆ వ్యత్యాసాన్ని తొలగించడమే లక్ష్యంగా మా ఎన్జీవో సంస్థ ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇప్పటికే 12 పాఠశాలలలోనూ డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు పూర్తయింది అని తెలిపారు.
మంచు లక్ష్మి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిద్దాం. విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయం.


