
📌 Key Points
- ముంబై లోకల్ ట్రైన్లో డోర్ మూయమన్నందుకు యువకుడి హత్య.
- వర్షం పడుతుండగా డోర్ మూయమని చెప్పగా గొడవ మొదలైంది.
- కత్తితో పొడిచి నిందితుడు పరారయ్యాడు, మృతుడు మయాంక్ లోహర్.
- రైలులో ప్రయాణికులు ఉన్నా ఎవరూ స్పందించకపోవడం ఆందోళనకరం.
ముంబై లోకల్ ట్రైన్లో జరిగిన ఈ దారుణ హత్య, నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణ పౌరుల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా రవాణాలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
రైలులో చిన్న గొడవ.. ప్రాణం తీసిన కత్తిపోటు
ముంబై లోకల్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది. వర్షం పడుతుందని రైలు కోచ్ డోర్ మూయాలని చెప్పినందుకు చెలరేగిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. బుధవారం రాత్రి అంధేరి, బోరివాలి స్టేషన్ల మధ్య ఈ దారుణం జరిగింది. ముంబైలోని విరార్ ప్రాంతానికి చెందిన మయాంక్ లోహర్ అనే యువకుడు అంధేరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. పనిముగించుకుని మయాంక్ తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో కూర్చున్నాడు. ఆ సమయంలో భారీ వర్షం రావడంతో కోచ్ డోర్ మూసివేయాలని అక్కడే ఉన్న మరో యువకుడికి చెప్పాడు. కానీ అతడు డోర్ మూసేందుకు నిరాకరించగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ క్రమంలో తన వద్ద దాచుకున్న పదునైన కత్తిని బయటకు తీసి నింధితుడు మయాంక్ కడుపులో పొడిచేశాడు. ఈ దాడిలో మయాంక్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరిగిన సమయంలో రైలులో చాలా మంది ఉన్నా ఎవరూ స్పందించలేదు. నింధితుడు నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ ఆగేలోపే దూకేశాడు. తరవాత స్టేషన్ లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మయాంక్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిపారు. నింధితుడు పరారీలో ఉండటంతో పోలీసులు ప్రత్యేక బృంధాలతో గాలిస్తున్నారు.
ప్రయాణికులు చూస్తుండగానే దారుణం
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న హింస, మానవత్వం లోపిస్తున్న తీరును స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.

