
📌 Key Points
- రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరిక.
- వరలక్ష్మి మిల్క్ సెంటర్ ద్వారా పాలు కొనుగోలు చేసిన 20 మందికి పైగా అస్వస్థత.
- పాలలో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిన్నాయని నిర్ధారణ.
- బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పోలీసులు.
రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
కల్తీ పాల ఘటనలో పెరుగుతున్న మరణాలు
రాజమండ్రి (లాలాచెరువు ప్రాంతం) కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చనిపోయిన వారితో కలిపి మృతు సంఖ్య 13కి చేరింది. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా ఫిబ్రవరి 22 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వరలక్ష్మి మిల్క్ సెంటర్ పంపిణీలో విషాదం
నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి నిర్వహించే ‘వరలక్ష్మి మిల్క్ సెంటర్’ నుండి పాలు కొనుగోలు చేసిన దాదాపు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పాలలో అత్యంత విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ (Ethylene Glycol) కలవడం వల్ల బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 16నే బాధితులు ఆసుపత్రుల్లో చేరినప్పటికీ… ఫిబ్రవరి 22న ఓ వృద్ధురాలు కాకినాడ జీజీహెచ్లో మృతి చెందింది. దీంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది.
కిడ్నీలు దెబ్బతినడానికి కారణం ఏమిటి?
ఇదే సమయంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురిలో అనారోగ్య లక్షణాలు బయటపడ్డాయి. ప్రధానంగా వాంతులు, వీరేచనాలు వంటివి కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని కూడా వెంటనే ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందించారు. వీరిలో ఇప్పటి వరకు 13 మంది ప్రాాణాలు కోల్పోగా… మరో ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది.
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


