
📌 Key Points
- తెలంగాణలో పోక్సో కేసులు పెరిగాయని, శాంతిభద్రతలు గాలికి వదిలేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ.
- ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, ఐదో అంతస్తు నుంచి నెట్టేసిన ఘటనపై ప్రస్తావన.
- పేట్ బషీరాబాద్ కేసులో ఏ2, ఏ3 సంగప్పలను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.
- బండి సంజయ్ని విచారించాలని, బాధితురాలిని బెదిరించారా లేదా అని అడగాలని డిమాండ్.
తెలంగాణలో పోక్సో కేసుల పెరిగిపోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శిస్తూ, బండి సంజయ్, సంగప్పలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పోక్సో కేసుల విజృంభణ: ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు
రాష్ట్రాన్ని పోక్సో సమస్య వేధిస్తున్నదని.. ముఖ్యమంత్రి శాంతిభద్రతలను గాలికి వదిలేశారని.. పోక్సో కేసు (POCSO case)లకు రాష్ట్రం చిరునామాగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో మహమ్మద్ గౌస్ అనే దుండగుడు 12 ఏళ్ల అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తానని అనడంతో అమ్మాయిని 5వ ఫ్లోర్ నుంచి నెట్టేయగా కోమాలోకి వెళ్లి, ఇపుడు నిమ్స్లో చికిత్స పొందుతున్నదన్నారు. 2024 లో కాంగ్రెస్ పాలనలో 2103 మందిపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయన్నారు.
మే 8న ఒక మహిళా తన కూతురిపై పలుమార్లు అత్యాచారం జరిగిందని పేట్ బషీరాబాద్లో కేసు పెడితే నిందితుడు అరెస్ట్ అయ్యారని.. కానీ, ఎ2,ఎ3 ఎక్కడ అని.. ఎ3 సంగప్ప ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసినా పోలీసులు ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బండి సంజయ్ని కూడా విచారించాలని.. ఆయన బాధితురాలిని బెదిరించారా లేదా? అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, హోం మంత్రి ఉన్నారా అని నిలదీశారు. సీతక్క హాస్పిటల్కి ఎందుకు రాలేదన్నారు. మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్ను నమ్ముకొని వస్తే, మహిళ అని కూడా చూడకుండా మోసం చేశారని ఆరోపించారు.
ఖమ్మం, పేట్ బషీరాబాద్ ఘటనలు: నిందితులపై చర్యలెక్కడ?
బండి సంజయ్, సంగప్ప అరెస్టుకు డిమాండ్: మంత్రుల పాత్రపై ప్రశ్నలు
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


