|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్వేతా బసు ప్రసాద్ సంచలనం: రెడ్ లైట్ ఏరియాకు వెళ్లానంటూ ఓపెన్ కామెంట్స్!

Published: 04-01-2026, 2:30 AM
శ్వేతా బసు ప్రసాద్ సంచలనం: రెడ్ లైట్ ఏరియాకు వెళ్లానంటూ ఓపెన్ కామెంట్స్!
  • శ్వేతా బసు ప్రసాద్ ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
  • ‘ఇండియా లాక్ డౌన్’ చిత్రంలో వేశ్య పాత్ర కోసం ముంబై రెడ్ లైట్ ఏరియాను సందర్శించింది.
  • కామాటిపురలో నివసించే మహిళల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నటి.
  • శ్వేతా బసు ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

నటి శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన ‘ఇండియా లాక్ డౌన్’ సినిమాలో వేశ్య పాత్రలో నటించేందుకు ముంబైలోని కామాటిపుర రెడ్ లైట్ ఏరియాను సందర్శించినట్లు ఆమె వెల్లడించారు. ఈ బోల్డ్ స్టెప్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ప్రస్థానం

శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అలా ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఈ సినిమా ఇచ్చినంత హిట్ ఏది ఇవ్వలేదు. అయితే కొన్నేళ్లు ఇండస్ట్రీకి కనిపించకుండా వెళ్ళిపోయిన ఈ అమ్మడు ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

‘రెడ్ లైట్ ఏరియా’ సందర్శన వెనుక నిజం

అలాగే సోషల్ మీడియాలోనూ శ్వేతా బసు ప్రసాద్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు బరువు పెరిగి బొద్దుగా కనిపించే శ్వేత ఇప్పుడు బరువు తగ్గి.. సన్నజాజి తీగలా మారింది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో అమ్మడు ముందు ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వైరల్ అవుతున్న వ్యాఖ్యలు, స్పందన

ఆమె మాట్లాడుతూ.. ‘నేను లాక్ డౌన్ సమయంలో ‘ఇండియా లాక్ డౌన్’ అనే సినిమాలో నటించాను. అందులో వేశ్య పాత్రలో నటించాను. అయితే ఈ సినిమాలో భాగంగా ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే మహిళలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది స్వయంగా తెలుసుకోవడానికి.. నేను ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురను సందర్శించాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

శ్వేతా బసు ప్రసాద్‌ తన పాత్రకు న్యాయం చేసేందుకు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఆమె అంకితభావాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.