
📌 Key Points
- యూరియా పంపిణీ యాప్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- జిల్లా యూనిట్కు బదులుగా మండలం లేదా నియోజకవర్గం యూనిట్గా మార్పు
- సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
- యూరియా కొరత నివారణకు ప్రైవేట్ దందాపై నిఘా
రాష్ట్రంలో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా యాప్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించనుంది.
యాప్లో మార్పులకు ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్ లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాప్ సేవలను సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల ప్రకారం…. జిల్లాను యూనిట్గా తీసుకుని యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఈ స్థానంలో మండలాలను యూనిట్ గా తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.
మండలాలను యూనిట్ గా తీసుకోవటంతో ఇబ్బందులు వస్తాయని భావిస్తే… నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ మార్పులు చేసి… యూరియాను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించటం ద్వారా…. యూరియా పంపిణీలో నెలకొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.
మండలం లేదా నియోజకవర్గం యూనిట్గా మార్పు
కొంతకాలంగా రాష్ట్రంలో యూరియా కొరత సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికితోడు ప్రైవేట్ వ్యక్తుల దందాతో లేనికొరతను సృష్టిస్తున్నారు. దీంతో రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యాప్ ను తీసుకువచ్చింది.ఈ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. Fertilizer Booking App ద్వారా ఈ సేవలను అందిస్తోంది.
యాప్ ద్వారా బుకింగ్ ప్రాసెస్ లో జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతానికి యూరియా యాప్లో జిల్లా యూనిట్గా పంపిణీ జరుగుతోంది. దీంతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రద్దీ ఏర్పడుతోంది. ముందు వచ్చిన వారికే యూరియా దొరుకుతోంది. దీంతో చాలా మరికొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
యూరియా పంపిణీలో సమస్యల పరిష్కారం
వీటన్నింటినీ పరిశీలించిన వ్యవసాయ శాఖ….. జిల్లా యూనిట్ల స్థానంలో ఇకపై రైతులకు అందుబాటులో ఉండే మండల కేంద్రాలు ఒకటి లేదా రెండింటిని కలిపి ఒక యూనిట్గా చేయాలని భావిస్తోంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలు తక్కువగా ఉంటే నియోజకవర్గం యూనిట్గా పంపిణీ చేయాలని కసరత్తు చేస్తోంది. త్వరలోనే యాప్ లో మార్పులు చేసి… ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది.
త్వరలోనే యూరియా యాప్లో మార్పులు చేసి రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిద్దాం.


