
బాలీవుడ్ నటి మౌని రాయ్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘ది భూతిని’ సినిమా థియేటర్లలో విజయవంతమైన తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. జీ5 లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
Key Points
మౌని రాయ్ నటించిన ‘ది భూతిని’ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.
జూలై 18 నుండి జీ5 లో స్ట్రీమింగ్ ప్రారంభం.
అదే రోజు రాత్రి 8 గంటలకు టీవీలో కూడా ప్రసారం.
థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు మంచి స్పందన లభించింది.
‘ది భూతిని’ ఓటీటీ విడుదల తేదీ
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్(Mouni Roy) ‘నాగిని’ సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి పరిచయం అయింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్రేజీ బ్యూటీగా మారింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. మౌనీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది భూతిని’(The Bhootini). సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారి(Palak Tiwari) కీలక పాత్రలో కనిపించారు. సిద్దాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
అయితే ఈ చిత్రాన్ని సంజయ్ దత్, దీపక్ ముకుత్ నిర్మించారు. హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా మే 1న థియేటర్స్లో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా, ‘ది భూతిని’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా జూలై 18న నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. అంతేకాకుండా అదే రోజున రాత్రి 8 గంటలకు టీవీల్లో కూడా రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మౌని రాయ్ నటనకు ప్రశంసలు
జీ5 లో స్ట్రీమింగ్
మొత్తంగా, ‘ది భూతిని’ సినిమా ఓటీటీ విడుదలతో మరింత మంది ప్రేక్షకులను చేరుకోనుంది. జూలై 18న జీ5 లో చూడండి.


