
📌 Key Points
- అల్లూరి జిల్లాలో సెల్ఫీ దిగుతూ ముగ్గురు బాలికలు మృతి.
- అనంతగిరి మండలం మూలగుమ్మి గ్రామంలో ఘటన.
- జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన బాలికలు.
- మృతుల్లో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు మైనర్ బాలికల ప్రాణాలను బలిగొంది. జలపాతంలో సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు మృతి చెందారు.
సెల్ఫీ దిగుతూ ప్రమాదం
సెల్ఫీ సరదాకు ముగ్గురు మైనరల్ బాలికల ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సరదాగా వాటర్ ఫాల్స్ లో దిగి అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ బాలికలు… అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. లోతును అంచనా వేయకపోవటంతో… ఉన్నట్టుండి నీళ్లలోకి జారుకుని దుర్మరణం చెందారు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మూలగుమ్మి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మైనర్ బాలికలు వేసవి సెలవుల నిమిత్తం సొంతూరుకు వచ్చారు. అయితే జలపాతం దగ్గర సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లారు.
ముగ్గురు బాలికల దుర్మరణం
జలపాతంలో కాసేపు నీళ్లలో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలతో సరదాగా గడిపారు. అంతలోనే ఒక అమ్మాయి నీళ్ల లోపలికి జారుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు ఆమెను కాపాడడానికి వెళ్లి వాళ్ళు కూడా మునిగిపోయారు. మరో ఇద్దరు బయటనే ఉండగా…. వాళ్లు తీసిన వీడియోలో ఇదంతా కూడా రికార్డు అయింది. ఓ వైపు అరుపులు అరుస్తుండగా… కాపాడవారు లేక ఆ ముగ్గురు నీళ్లలోనే చనిపోయారు. చనిపోయిన వారిలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) ఉన్నారు. వీరంతా ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది.
జలపాతం ఒడ్డున ఉన్న మరో అమ్మాయి వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే జలపాతంలోకి దిగి ముగ్గురు అమ్మాయిలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అవ్వడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రామంలో విషాద ఛాయలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. అయితే వేసవి వేళ జలపాతాలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హచ్చరిస్తున్నారు. ఈత రాకుండా అసలు దిగవద్దని సూచిస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జలపాతాలు, చెరువుల వద్దకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


