
📌 Key Points
- టీఎస్టీ, ఎంఎస్టీ పరీక్షల ప్రాథమిక కీలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది.
- మొత్తం 198 టీఎస్ఆర్టీసీ పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్ష జరిగింది.
- కీపై అభ్యంతరాలుంటే ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలి.
- ఒక్కో అభ్యంతరానికి రూ.500 రుసుము చెల్లించాలి, సరైన అభ్యంతరమైతే తిరిగి చెల్లిస్తారు.
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక కీని పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 198 ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు.
టీఎస్టీ, ఎంఎస్టీ ప్రాథమిక కీ విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) రాతపరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఇందుకోసం మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా… శనివారం (ఏప్రిల్ 05) ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు ఎప్పుడంటే?
ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపొచ్చు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారపత్రాలతో సహా వెబ్సైట్లోని నిర్ణీత టెంప్లెట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తప్పనిసరిగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఏరియాలో ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ – 114 పోస్టులను భర్తీ చేస్తారు.అన్ని కలిపి 198 పోస్టులున్నాయి. అభ్యంతరాలు లెవనెత్తే అభ్యర్థులు…. ప్రతి ప్రశ్నకు రూ.500 రుసుంను చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదిగా నిర్ధారణైతే రుసుంను తిరిగిచ్చేస్తామని స్పష్టం చేశారు.
రుసుము వివరాలు, తిరిగి చెల్లింపు విధానం
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టీఎస్ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రాథమిక కీపై మీ అభ్యంతరాలను సకాలంలో తెలియజేసి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.


