
📌 Key Points
- తమిళనాడులో స్కూళ్లు, దేవాలయాల వద్ద మద్యం షాపుల తొలగింపునకు సీఎం విజయ్ నిర్ణయం.
- ఇప్పటికే ఉన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న షాపులపై చర్యలు అని టీవీకే వాదన.
- ప్రతిపక్షాలు దీనిని కేవలం విజయ్ పీఆర్ టీమ్ లీక్ చేసిన హైప్ స్టంట్ గా అభివర్ణించాయి.
- ఈ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) లో టీవీకే, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది.
తమిళనాడు సీఎం విజయ్ మద్యం షాపులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, దేవాలయాలకు దగ్గరలో ఉన్న షాపులను తొలగించాలని ఆదేశించగా, ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు దీనిని పీఆర్ స్టంట్ అని విమర్శిస్తున్నాయి.
విజయ్ సంచలన నిర్ణయం: మద్యం షాపుల తొలగింపు
తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్కూళ్లు, దేవాలయాలు, కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలు, స్కూళ్లు మరియు కాలేజీలకు 100 మీటర్లు దూరంగా వైన్ షాపులు ఉండాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి.
దీంతో విజయ్ కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం హైప్ కోసమే విజయ్ కి చెందిన పీఆర్ టీమ్ ఇటాంటి లీకులు ఇస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల వైన్ షాపులు స్కూళ్లు, దేవాలయాలకు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు. కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా వాటిని ఏర్పాటు చేశారని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అవి తెరుచుకునే ఉంటాయని అంటున్నారు. దీంతో ఎక్స్ లో టీవీకే కార్యకర్తలు వర్సెస్ ప్రతిపక్షాల కార్యకర్తలు అన్న చందంగా ట్వీట్స్ వార్ నడుస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలు: పీఆర్ స్టంట్ ఆరోపణలు
ఎక్స్ లో ట్వీట్స్ వార్: టీవీకే వర్సెస్ ప్రతిపక్షాలు
మొత్తానికి, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.


