
📌 Key Points
- ఈషా రెబ్బ తల్లి హార్ట్ ఎటాక్తో కారులోనే మరణించారు.
- షూటింగ్ ఆగిపోకూడదని 11 రోజులకే సెట్స్లో అడుగుపెట్టారు ఈషా.
- కుటుంబం ఒకరికొకరు తోడుగా నిలిచామని ఈషా గుర్తు చేసుకున్నారు.
- తల్లి లేని లోటును ఎవరూ తీర్చలేరని ఈషా ఎమోషనల్ అయ్యారు.
ప్రముఖ నటి ఈషా రెబ్బ తన జీవితంలో జరిగిన విషాద సంఘటన గురించి వెల్లడించారు. షూటింగ్ సమయంలో తన తల్లి గుండెపోటుతో కారులోనే మరణించారని ఆమె తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె అన్నారు.
గుండెపోటుతో తల్లి మరణం
Eesha Rebba: గ్లామర్ ప్రపంచంలో నవ్వుతూ కనిపించే తారల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. తెలుగు అమ్మాయిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ (Eesha Rebba) జీవితంలోనూ మర్చిపోలేని ఒక విషాదం ఉంది. తన ఎదుగుదలను చూసి మురిసిపోవాల్సిన తల్లి, షూటింగ్ సమయంలోనే అనూహ్యంగా కన్నుమూయడం ఆమెను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ గడ్డు కాలాన్ని తలచుకుంటూ తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా పంచుకున్న భావోద్వేగపూరితమైన విషయాలు ఇప్పుడు సగటు మనిషిని సైతం కదిలించేస్తున్నాయి.
ఈషా రెబ్బ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తల్లి హార్ట్ ఎటాక్తో మరణించారట. ఈషా మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. అప్పుడే అమ్మకు హార్ట్ ఎటాక్ అంటే ఫోన్ వచ్చింది. ఈ విషయం విని షాక్ అయ్యాను మా నాన్న కూడా షాక్ లోకి వెళ్లిపోయారు.. అమ్మను ఇంటి నుండి హాస్పిటల్ కి కారులో తీసుకెళ్లే సమయంలో కార్ లోనే ఆమె చనిపోయారు. కేవలం 53 ఏళ్ల వయసులోనే నా తల్లి మరణించటం నన్ను మానసికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది” అంటూ ఈషా చెప్పుకొచ్చింది.
షూటింగ్ లో విషాదం
అమ్మ అంటే ప్రాణమిచ్చే ఈషాకు ఆ మరణం కలిగించిన బాధ వర్ణనాతీతం. అయితే, ఒక నటిగా తన బాధ్యతను ఆమె విస్మరించలేదు. తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని, నిర్మాతలకు నష్టం కలగకూడదని భావించిన ఈషా, అమ్మ చనిపోయిన కేవలం 11 రోజులకే తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టారు. కళ్లలో కన్నీళ్లు ఉన్నా, గుండె నిండా బాధ ఉన్నా.. అవన్నీ దిగమింగుకుని కెమెరా ముందుకు వచ్చి నటించడం ఒక నటిగా ఆమె అంకితభావాన్ని చాటిచెబుతోంది. ఆ సమయంలో తన తండ్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆ కష్టకాలంలో కుటుంబం అంతా ఒకరికొకరు తోడుగా నిలిచామని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఈషా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అమ్మ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని, ఆమె ఎమోషనల్ సపోర్ట్ తనకు చాలా అవసరమని చెప్పారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని కొనియాడారు. ఇప్పుడు తాను సాధిస్తున్న విజయాలను చూసేందుకు అమ్మ లేకపోవడం తనను ఎప్పుడూ బాధిస్తుంటుందని పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన విజయాలే కాకుండా, కుటుంబ విలువలకు ఈషా ఇచ్చే ప్రాధాన్యత ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. తన తల్లి జ్ఞాపకాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని ఆమె ఎమోషనల్ అయ్యారు.
కుటుంబం అండగా నిలవడం
ఇక తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈషా రెబ్బ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆమె అన్నారు. అమ్మ లేని లోటు తీర్చలేనిదని ఆమె తెలిపారు.


