
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా ఆర్థిక మోసం కేసులో లుకౌట్ నోటీసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఈ దంపతులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించాల్సి ఉంటుందని కోర్టుకు విన్నవించారు.
Key Points
రూ.60 కోట్ల ఆర్థిక మోసం కేసులో శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
వృత్తి, వ్యాపార అవసరాల కోసం తరచుగా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని దంపతులు కోర్టును కోరారు.
లుకౌట్ నోటీసుల రద్దు కోరుతూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జనవరి 2026 వరకు లుకౌట్ నోటీసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై లుకౌట్ నోటీసులు
ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు(ఎల్వోసీ) జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.60 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ జంట నిందితులుగా ఉంది. దీంతో ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ దంపతులకు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ విషయంలోనే ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించింది.
విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
తమపై ఉన్న లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని ముంబై హైకోర్టును శిల్పాశెట్టి దంపతులు ఆశ్రయించారు. ఈమేరకు వారి తరఫున ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో వారి లాయర్ ఇలా చెప్పారు. రాజ్కుంద్రా ఒక వ్యాపారవేత్త అని.., శిల్పాశెట్టి సినీ నటి కావడంతో ఇరువురు తరచుగా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆమె తన వృత్తిపరమైన పనుల కోసం నిత్యం ప్రయాణించాల్సి ఉంటుందని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. వారిద్దరూ కేవలం నిందితులు మాత్రమేనని వారు తమ వ్యాపారం, వృత్తిని కొనసాగించే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు.
కోర్టు పరిశీలనలో శిల్పాశెట్టి దంపతుల పిటిషన్
లుకౌట్ నోటీసుల పేరుతో వారి అవకాశాలను దూరం చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. జనవరి 2026 వరకు లుకౌట్ నోటీసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, వారి అభ్యర్తనను న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. దీంతో వారికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి రావచ్చని తెలుస్తోంది.
శిల్పాశెట్టి, రాజ్కుంద్రా విదేశీ ప్రయాణాల కోసం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ దంపతులకు త్వరలోనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.


