|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ అవార్డ్స్ కమిటీలో ఊహించని మార్పు! కొత్త ఛైర్మన్ ఎవరంటే?

Published: 19-02-2026, 11:35 AM
గద్దర్ అవార్డ్స్ కమిటీలో ఊహించని మార్పు! కొత్త ఛైర్మన్ ఎవరంటే?
  • గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు.
  • కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • జనవరి 31న గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల పేరును ప్రకటించారు.
  • ఉగాది సందర్భంగా మార్చి 19న 2024-25 సంవత్సరానికి అవార్డులు అందజేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ను మార్చింది. కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పునకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ

Telangana Gaddar Film Awards: కళాకారులకు ఇచ్చే పురస్కారాలైన నంది అవార్డ్స్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy) ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Telangana Gaddar Film Awards)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఈ సత్కార్యాన్ని మళ్లీ పున: ప్రారంభించి, ఆగిపోయిన సంవత్సరం నుంచి లెక్క పెట్టి అన్ని సంవత్సరాలకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవార్డులను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అవార్డుల జ్యూరీ కమిటీలో అనూహ్య మార్పు సంభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ను మార్చారు. ఇంతకు ముందు ఉన్న ఛైర్మన్‌ను మార్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన మరో దర్శకనిర్మాతకు ఆ హోదా కల్పించారు. వివరాల్లోకి వెళితే..

ఎందుకు ఈ మార్పు? అసలు కారణం ఏమిటి?

తొలుత ఈ కమిటీ చైర్మన్‌గా సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావును ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయన స్థానంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy)ను చైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జీవో నెంబర్ 236ను జారీ చేసింది. మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియలేదు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ కేవలం సినిమా రంగం మాత్రమే కాకుండా, సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. ప్రజా కవి గద్దర్ పేరు మీదుగా ఇస్తున్న ఈ అవార్డుల ప్రక్రియలో తమ్మారెడ్డి భరద్వాజ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడు?

2024 జనవరి 31న ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డుల పేరును అధికారికంగా ప్రకటించారు. దాదాపు 10 సంవత్సరాల అవార్డులను ఒకేసారి ప్రకటించి, అవార్డుల వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి‌గానూ విజేతల ఎంపిక జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఇప్పుడు నూతనంగా ఎంపికైన ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ.. టీమ్‌తో కలిసి స్పెషల్ అవార్డుల కేటగిరీలోని విజేతల ఎంపికను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.