
📌 Key Points
- చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం రూ.375 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
- ఈ సినిమా జీ5 ఓటీటీలో విడుదలై 200 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్తో రికార్డు సృష్టించింది.
- సినిమాలో చిరంజీవి చూసే సీరియల్లో నటించిన సౌమ్య పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- సౌమ్య పాత్రలో నటించిన సాయి ప్రియ రెడ్డి గతంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించింది.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక సీరియల్ చూస్తుండగా, అందులోని నటి సాయి ప్రియ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి సినిమాలో సీరియల్ కనెక్షన్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి సినిమా కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీ ఆదరణ కూడా ఈ చిత్రానికి బాగా లభించింది. ఒక్క రోజులోనే 200 మిలియన్ మినిట్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ సినిమా.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అటు సీరియల్ ప్రియులు కూడా ఈ సినిమా లోని ఒక సన్నివేశంకి బాగా కనెక్ట్ అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. “చిరంజీవి ఈ సినిమాలో ఒక సీరియల్ ను రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ లో నటించే హీరోయిన్ కి ఆయన కనెక్ట్ అవుతారు కూడా.. చిరంజీవి పాత్ర ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్ లోని పాత్రల గురించి చెప్పడం, అతని జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం,” ఇది అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు సీరియల్స్ ని ఇష్టపడే వాళ్లకు కూడా బాగా నచ్చింది. చిరంజీవి చూసిన సీరియల్ లో హీరోయిన్ సౌమ్య పాత్రలో నటించిన అమ్మాయి.. ఆయనకు ఇష్టమైన నటి కూడా.. మరి చిరంజీవి పాత్ర మెచ్చిన ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి ఇప్పుడు అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
సౌమ్య పాత్రలో సాయి ప్రియ రెడ్డి
ఆమె పేరు సాయి ప్రియ రెడ్డి(Sai Priya Reddy). ఈమె తెలుగమ్మాయి కూడా.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని సీరియల్ లో చిరంజీవి ఫేవరెట్ నటిగా సౌమ్య పాత్రలో నటించింది. సీరియల్ లో కనిపించిన ఈమె.. రియల్ లైఫ్ లో మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ రెబల్, మిర్చి, పూలరంగడు , నందీశ్వరుడు, క్షేత్రం, తడాఖా, జీనియస్ వంటి ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. యూట్యూబ్లో పలు సీరీస్ లు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది.
అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈమె ఇటీవల విశ్వక్ సేన్ లైలా, సందీప్ కిషన్ మజాకా చిత్రంలో కూడా నటించింది. ఇక ఇప్పుడిప్పుడే నటిగా సినిమాలలో బిజీ అవుతోంది. ఇకపోతే ఇదివరకు చిన్న చితక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఇప్పుడు చిరంజీవి ఫేవరేట్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకొని వెలుగులోకి వచ్చేసింది. మరి మునుముందు ఈమెకు నటిగా మరిన్ని అవకాశాలు లభించాలని ఆశిద్దాం.
సాయి ప్రియ రెడ్డి సినీ ప్రస్థానం
Tags Chiranjeevi Serial Actress Share
సాయి ప్రియ రెడ్డి చిన్నప్పటి నుండి నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు చిరంజీవి సినిమాలో మెరవడం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


