|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పోలీసులకు ‘ఐబొమ్మ’ వార్నింగ్‌.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

Published: 03-10-2025, 7:13 AM
పోలీసులకు 'ఐబొమ్మ' వార్నింగ్‌.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ పోలీసులు సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన తర్వాత, ఐబొమ్మ నుండి పోలీసులకు హెచ్చరికలు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. అయితే, ఈ వార్తలు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్ స్పష్టం చేసింది. ఇది 2023 నాటి పాత సమాచారమని వివరించింది.

Key Points

1

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు.

2

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది.

4

ప్రచారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివని, అవి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది.

పైరసీ ముఠా అరెస్టు: సైబర్ క్రైం చర్యలు

సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్‌కార్డులు, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ  ఒక పోస్ట్‌ వైరల్‌ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ  తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ (Fact Check) టీమ్‌ చెప్పింది.

ఐ బొమ్మ గురించి   తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ పేజీ తమ ‘ఎక్స్‌’లో ఓ పోస్టు పెట్టింది. ‘కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.’ అని తెలిపింది.

ఐబొమ్మ వార్నింగ్‌పై వాస్తవం

తెలంగాణ ప్రభుత్వం స్పష్టత, ప్రజలకు సూచన

సినిమా పైరసీపై పోరు కొనసాగుతుండగా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. ప్రజలు వార్తలను షేర్ చేసే ముందు జాగ్రత్త వహించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.