
📌 Key Points
- ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన పార్వతి మెల్టన్.
- లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న పార్వతి.
- అమెరికన్ ఫోటోగ్రాఫర్ లిండీ పారిస్ తో కలిసి ఫోటోషూట్.
- పార్వతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ తన గ్లామర్ ఫోటోలతో మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పార్వతి మెల్టన్ లేటెస్ట్ ఫోటోషూట్
Parvathi Melton : ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలలో జతకట్టిన హీరోయిన్లు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. సినీ అవకాశాలు లేకనో లేక ఏదైనా కారణాల వలన తెలీదు కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. కొంతమంది ముద్దుగుమ్మలు ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తమ ఏజ్ కి తగ్గ పాత్రలు వేస్తూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ ఔరా అనిపించే పిక్స్ ని షేర్ చేసింది. ఘాటు ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ ఓవర్ లోడెడ్ పిక్స్ ను ఆమె షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..
ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పార్వతి మెల్టన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఈమధ్య సినిమాలకు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. స్టైలిష్ ఫోటో షూట్ కారణంగా ఇప్పుడు వార్తల్లో నిలిచారు.. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మైండ్ బ్లాక్ అయ్యే హాట్ పిక్స్ ని షేర్ చేసింది.. అమెరికాకు చెందిన ఫోటోగ్రఫీ టీమ్ లిండీ పారిస్ ఫొటోగ్రఫీ షేర్ చేసింది. ఆ ఫోటోల్లో పార్వతి మెల్టన్ మరో మోడల్ రోజ్ గెర్బర్ తో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చింది. మామూలు గ్లామర్ ఫోటోల కన్నా భిన్నంగా ఉన్నాయి. వింటేజ్ థీమ్ తో చేసిన ఆ షూట్ అందరి ద్రుష్టిని ఆకర్షించాయి. గత కొన్ని లుగా బయట కనిపించని ఏమని ఇలా హాట్ లుక్ లో చూడడంతో జనాలు షాక్ అవుతున్నారు. పార్వతి మెల్టన్ మళ్లీ కం బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుందేమో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి.
సినిమాలకు దూరం కావడానికి కారణం?
తెలుగు చిత్రాలతో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ పార్వతి మెల్టన్ 2004లో మోడలింగ్ చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. తల్లి ప్రీతి సింగ్ పంజాబీ. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉన్న పార్వతి భరత నాట్యంలో శిక్షణ పొందారు.. 2005లో మిస్ ఇండియా లె విసాజ్ యూఎస్ఏ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.. అదే ఏడాది వెన్నెల అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. గేమ్, మధుమాసం, అల్లరే అల్లరి, జల్సా వంటి చిత్రాల్లో నటించి చేరువయ్యారు. 2012లో పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పటి నుంచి బయట కూడా ఆమె పెద్దగా కనిపించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి లుక్ లో కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత హాట్ గా ఈమె ఫోటో షూట్ చేయడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా అనే అనుమానం కూడా వస్తుంది. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా షేర్ చేస్తున్నామో చూడాలి..
సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమవుతోందా?
Tags Parvathi Melton Photo shoot social media tollywood movies Share
మొత్తానికి పార్వతి మెల్టన్ తన హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తారో లేదో వేచి చూడాలి. ఆమె అభిమానులు మాత్రం ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.


