
సమంత రూత్ ప్రభు నిర్మాణంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘శుభం’ టీవీలో ప్రసారం కానుంది. మే నెలలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమా సెప్టెంబర్ 14న స్టార్ మాలో ప్రసారం అవుతుంది.
Key Points
సమంత నిర్మించిన 'శుభం' సినిమా టీవీలో ప్రసారం కానుంది.
సెప్టెంబర్ 14న సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం.
హారర్ కామెడీ జానర్లో విజయవంతమైన ఈ చిత్రం టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.
థియేటర్లలో, ఓటీటీలో విజయం సాధించిన తర్వాత, టీవీలో ప్రీమియర్.
శుభం సినిమా టీవీ ప్రీమియర్ వివరాలు
సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా శుభం (Subham). ఈ ఏడాది మే 9న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు టీవీలోకి వస్తోంది. ప్రస్తుతం జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
సమంత నిర్మించి అతిథి పాత్రలో నటించిన తెలుగు బ్లాక్బస్టర్ హారర్ కామెడీ మూవీ శుభం మొత్తానికి నాలుగు నెలల తర్వాత టీవీలోకి వస్తోంది. వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 14న సాయంత్రం 6.30 గంటలకు ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నట్లు స్టార్ మా ఛానెల్ వెల్లడించింది.
“భయాలు మిమ్మల్ని నవ్విస్తాయి. నవ్వులు మిమ్మల్ని వణికిస్తాయి.. శుభం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మిస్ కావద్దు. ఈ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మీ స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి మూవీకి సంబంధించిన చిన్న క్లిప్ యాడ్ చేసింది.
సినిమా విజయం మరియు టీవీ ప్రసారం
నటిగా టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సమంత నిర్మాతగానూ శుభం మూవీతో తొలి ప్రయత్నంలోనే విజయం దక్కించుకుంది. ఓ చిన్న సినిమాగా రిలీజై.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.10 కోట్ల వరకూ వసూలు చేసింది. అంతేకాదు జియోహాట్స్టార్ ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం కూడా మరో రూ.3 కోట్ల వరకూ చెల్లించింది. దీంతో సమంతపై కాసుల వర్షం కురిసింది.
ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా సినిమాలో హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ముగ్గురు స్నేహితులు, వాళ్ల భార్యలకు ఉండే సీరియల్స్ పిచ్చి నేపథ్యంలో సాగుతుంది. జన్మజన్మల బంధం అనే ఆ సీరియల్ ఆ ముగ్గురు స్నేహితుల జీవితాలను ఎలా మార్చేసిందన్నదే ఈ మూవీ స్టోరీ.
సమంత నిర్మాణం మరియు సినిమా కథ
సీరియల్ అంటేనే ఏళ్లకు ఏళ్లు సాగడం కామన్. ఓ టీవీ సీరియల్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ..అది పూర్తికాకుండానే చనిపోయిన వాళ్లు ఆత్మలై తిరిగి వచ్చి సీరియల్ను చూస్తే ఏంటన్నదే శుభం సినిమా కథ. ఈ గమ్మత్తైన కథను మూడు యువ జంటల జీవితాలతో అంతే ఫన్నీగా తెరపై చూపించారు దర్శకుడు.
హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించడంతోపాటు ఓటీటీలోనూ దూసుకెళ్లింది. ఇప్పుడు స్టార్ మాలోకి అడుగు పెట్టబోతోంది. మరి టీవీ ప్రీమియర్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మొత్తం మీద, ‘శుభం’ సినిమా థియేటర్లు, ఓటీటీల తర్వాత టీవీ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. టీవీ ప్రీమియర్ ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.


